శ్రీమతి చంద్రలత

విశ్వనాథ సత్యనారాయణ గారి బద్దన్న సేనాని నవలా కథనం మీద "97" లో తానా వారి పురస్కారం పొందిన నవల "రేగడి విత్తులు" రచయిత్రి శ్రీమతి చంద్రలత గారి వ్యాసం ఇక్కడ చూడండి
ప్రస్తుతం నెల్లూరు జిల్లా పొగతోటలో "హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్" గా పనిచేస్తున్న వీరు 1993లో నవలా సాహిత్యలోకం లో అడుగుపెట్టి యాభై కి పైగా కథలు , మూడు నవలలు, ఎన్నో వ్యాసాలు వ్రాసారు.కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఆ గోల్డు మెడల్ పొందిన వీరి రచనా శైలి అద్భుతం. వీరి నవలలు "వర్ధని", "రేగడి విత్తులు" , "దృశ్యాదృశ్యము" తప్పక చదివి తీరవల్సినవి..
శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారి అసంపూర్ణ రచన "పురాణ వైరాగ్యం" పూర్తి చేసిన ఘనత వీరికి దక్కుతుంది. ఇవి కాక ఎన్నో పురస్కారాలు, అభినందనలు, అవార్డులు పొందిన ఈ అచ్చ తెలుగు మహిళ, ఈ విధంగా తన వ్యాసం మీతో పంచుకోమని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో