" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


చెన్నపట్నంలో తెలుగు ముద్రణాలయం స్థాపించి ఎన్నో అమూల్యమైన కావ్యాలను, గ్రంధాలను ముద్రించి అపారమైన సేవ చేసిన మహనీయుని చిత్రమిది.

"చేతివ్రాత పుస్తకములు చదువుకొనే రోజుల్లో ముద్రణాలయమును స్థాపించి చదువరుల కష్టములను తీర్చిరి" అని సి.పి.బ్రౌన్ దొర చేత ప్రశంసలు పొందిన భాషాసేవకుడీయన ! ఈయన వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు !

"భాగవతం రాసిందెవరండీ" ? అని అడిగితే
"వావిళ్ళ వారు కాదూ" - అనేవారట ఒకనాడు

"ఆది సరస్వతీ ముద్రాలయం" స్థాపించి 1854-62 మధ్యలోనే యాభై పుస్తకాలు ముద్రించిన వావిళ్ళ సంస్థ - 1906 లో రామస్వామి శాస్త్రి గారి కుమారులు వేంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో ' వావిళ్ళ ముద్రణాలయం ' గా మారి తెలుగు భాషా సాహిత్యాలకు అనుపమానమైన సేవ చేసిన వావిళ్ళ సంస్థ . . . . . . . . చివరకు ఆర్ధిక ఇబ్బందులకు గురై దీనస్థితికి చేరుకుంది. ఇదీ మనవారి స్థితి !
www.maganti.org
All Rights Reserved